ఏపీ క్యాబినెట్ నిర్ణయాలివే
రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్స్కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ఏపీ క్యాబినెట్ ఆమోదం;
Advertisement
రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్స్కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సెక్రటేరియేట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో టీచర్స్ బదిలీల నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేశారు. రాజధాని అమరావతిలో భూ కేటాయింపులకు సంబంధించిన మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం లభించింది. ఎస్సీ వర్గీకరణ అంశంపైనా క్యాబినెట్ భేటీలో చర్చ జరిగింది. ఈ అంశంపై ఇటీవల రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
మరిన్ని క్యాబినెట్ నిర్ణయాలివే..
- నంబూరులో వీవీఐటీయూకు ప్రైవేట్ యూనివర్సిటీ హోదా కల్పిస్తూ నిర్ణయం
- అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటునకు ఆమోదం
- పలు సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం గ్రీన్సిగ్నల్
- వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరు ఇకపై తాడిగడప మున్సిపాలిటీగా మార్పు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం
- సీఎం కార్యాలయంలో ముగ్గురు ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పోస్టులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
Advertisement