పారిశుద్ధ్య కార్మికులతో చంద్రబాబు ముఖాముఖి
తణుకు కూరగాయల హోల్సేల్ మార్కెట్ను పరిశీలించిన ఏపీ సీఎం;
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. స్థానిక ఎన్టీఆర్ పార్క్ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. తణుకు కూరగాయల హోల్సేల్ మార్కెట్ను పరిశీలించారు. కూరగాయల వ్యర్థాల నుంచి ఎరువుల తయారీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు అంతకుముందు స్థానిక పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చసిన హెలిప్యాడ్కు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు, నేతలు, అధికారులు ఘనస్వాగతం పలికారు.
గత ప్రభుత్వంలో సీఎం ఎప్పుడైనా ప్రజల్లో తిరిగారా? ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకుని వచ్చేవారు. విమానంలో వస్తే చెట్లను నరుక్కుంటూ వచ్చేవాళ్లు. ప్రజల సమస్యలు వినడానికి కనీసం మాట్లాడనిచ్చేవారు కాదు. మాది ప్రజా ప్రభుత్వం.. ప్రజల సమస్యలు వినడానికి వచ్చాను. పరిపాలనలో సంస్కరణలు తేవాలన్నదే మా ఏకైక లక్ష్యం అన్నారు. గత ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పు మనకు మిగిల్చి వెళ్లింది. అప్పు తీర్చడంతో పాటు వడ్డీ కూడా కట్టాల్సి వస్తున్నది. గత సీఎం కనీసం మురికి కాల్వల్లో పూడిక కూడా తీయించలేదు. జగన్ 45 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చారు. స్వచ్ఛాంధ్ర కోసం ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని , పరిసర ప్రాంతాలన్నీపరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
పేదల పింఛన్లు రూ. 3 వేల నుంచి 4 వేలకు పెంచాం. దివ్యాంగులకు పింఛన్ రూ. 3 వేల నుంచి 6 వేలకు పెంచాం. చరిత్రలో మొదటిసారిగా మధ్యతరగతి కుటుంబాలకు బీమా కల్పిస్తున్నాం. స్వర్ణాంధ్ర 2047 పేరుతో ఒక స్పష్టమైన విధానం తీసుకొచ్చాం. ప్రజల తలసరి ఆదాయం పెంచడానికి కృషి చేస్తున్నామని చంద్రబాబు అన్నారు.