నేడు విశాఖకు జగన్‌.... భద్రత కట్టుదిట్టం....

హత్యాయత్నం కారణంగా తాత్కాలికంగా పాదయాత్రను వాయిదా వేసుకున్న జగన్‌ శనివారం నుంచి తిరిగి తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఇందుకోసం నేడు విశాఖ రానున్నారు. అక్కడి నుంచి విజయనగరం జిల్లాలో పాదయాత్రకు వెళ్లనున్నారు. జగన్‌పై హత్యాయత్నం నేపథ్యంలో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటి వరకు జగన్‌ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ నేరుగా ఆయన వద్దకే వెళ్లి కలిసేవారు. అయితే దాడి నేపథ్యంలో జగన్‌ చుట్టూ భద్రతను పెంచనున్నారు. రోప్‌ పార్టీని కట్టుదిట్టం చేయనున్నారు. హత్యాయత్నం జరిగిన […]

Advertisement
Update: 2018-11-01 21:28 GMT

హత్యాయత్నం కారణంగా తాత్కాలికంగా పాదయాత్రను వాయిదా వేసుకున్న జగన్‌ శనివారం నుంచి తిరిగి తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఇందుకోసం నేడు విశాఖ రానున్నారు. అక్కడి నుంచి విజయనగరం జిల్లాలో పాదయాత్రకు వెళ్లనున్నారు. జగన్‌పై హత్యాయత్నం నేపథ్యంలో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేసేందుకు సిద్దమవుతున్నారు.

ఇప్పటి వరకు జగన్‌ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ నేరుగా ఆయన వద్దకే వెళ్లి కలిసేవారు. అయితే దాడి నేపథ్యంలో జగన్‌ చుట్టూ భద్రతను పెంచనున్నారు. రోప్‌ పార్టీని కట్టుదిట్టం చేయనున్నారు. హత్యాయత్నం జరిగిన తర్వాత తమపై తీవ్ర విమర్శలు రావడంతో పోలీసులు తమ పనితీరు ఏంటో చూపిస్తామంటున్నారు.

కాబట్టి పాదయాత్రలో ప్రజలను నేరుగా జగన్ వద్దకు గతంలో లాగా అనుమతిస్తారా లేక ఆంక్షలు పెడతారా అన్నది చూడాలి. జగన్‌ భద్రత దృష్ట్యా కొన్ని ఆంక్షలు పెట్టడం కూడా సబబేనని వైసీపీ నేతలు కూడా భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News