మంచిరేవులలో యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Advertisement
Update:2024-10-21 16:08 IST

రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ స్కూల్‌ ఏర్పాటు చేయబోతున్నారు. సర్వీస్‌ లో ఉన్న పోలీసుల పిల్లలతో పాటు పోలీస్‌ అమరవీరుల పిల్లలు, పోలీసులతో పాటు ఇతర యూనిఫాం సర్వీసులైన ఫైర్‌, ఎక్సైజ్‌, ఎస్పీఎఫ్‌ సిబ్బంది పిల్లలకు పోలీస్‌ స్కూల్‌ లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ స్కూల్‌ ఏర్పాటుకు అవసరమైన తదుపరి చర్యలు డీజీపీ చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News