సొంత గూటికి చేరనున్న తీగల కృష్ణారెడ్డి

త్వరలో తాను టీడీపీలో చేరునున్నట్లు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తెలిపారు. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డిలు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు.

Advertisement
Update:2024-10-07 13:45 IST

త్వరలో తాను తెలుగు దేశం పార్టీలోకి చేరునున్నట్లు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తెలిపారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డిలు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు.హైదరాబాద్ అభివృద్ధి చెందింది అంటే టీడీపీ, చంద్రబాబు వల్లనే అని తెలిపారు. తెలంగాణ లో ఇంకా టీడీపీ అభిమానులు చాలా మంది ఉన్నారు.

తెలంగాణ లో టీడీపీ కి మళ్లీ పూర్వ వైభవం తీసుకోస్తాం అన్నారు. త్వరలో టీడీపీ లో జాయిన్ అవుతాను అని తెలిపారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందో మీరందరూ చూస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. టీడీపీ నుంచి తీగల కృష్ణారెడ్డి రాజకీయ ప్రస్థానం మొదలైంది. 2009లో ఆ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో టీడీపీ తరుపున పోటీ చేసి గెలిచారు. అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరారు.

Tags:    
Advertisement

Similar News