రేవంత్‌ ప్రతీకార రాజకీయాలు మానుకో

హర్యానా ఫలితాలు చూసైనా బుద్ధి తెచ్చుకో : మాజీ మంత్రి హరీశ్‌ రావు

Advertisement
Update:2024-10-08 17:46 IST

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అయినా సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలు మానుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌ రావు హితవు పలికారు. కాంగ్రెస్‌ పార్టీ గ్యారంటీలను ప్రజలు విశ్వసించలేదని తేలిపోయిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న కర్నాటక, తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్‌ లో ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ చేసిన మోసాన్ని ప్రజలు గమనించారని, ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైందన్నారు. ఇకనైనా రేవంత్‌ రెడ్డి ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలు కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించాలన్నారు. జమ్మూకశ్మీర్‌ ప్రజలు బీజేపీని, హర్యానా ప్రజలు కాంగ్రెస్‌ ను విశ్వసించలేదని, రెండు జాతీయ పార్టీలపై ప్రజల్లో విముఖత ఉందని ఈ ఫలితాలతో స్పష్టమైందన్నారు.

Tags:    
Advertisement

Similar News