పెండింగ్‌లో 10వేలకు పైగా హైడ్రా పిటిషన్లు : రంగానాథ్

ఇప్పటి వరుకు10వేలకు పైగా హైడ్రా పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయన్నాయని కమీషనర్ రంగానాథ్ అన్నారు.;

Advertisement
Update:2025-03-12 20:52 IST

అక్రమ కట్టడాలపై హైడ్రాకు పెద్ద ఎత్తున కంప్లైంట్‌లు వస్తున్నాయని హైడ్రా కమీషనర్ రంగానాథ్ అన్నారు. ఇప్పటి వరుకు10వేలకు పైగా పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు.చెరువుల పరిస్థితి, ఇప్పటి పట్టణీకరణ, హైడ్రా చేస్తున్న పనులపై బుధవారం ఆయన ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ప్రజావాణికి నేరుగా వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఆన్‌లైన్‌లో కూడా చాలా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. త్వరలో హైడ్రా పోలీస్‌ స్టేషన్‌ రాబోతోందని తెలిపారు. ఎప్పటికప్పుడు ఫిర్యాదుల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు

Tags:    
Advertisement

Similar News