కీరవాణి, అందెశ్రీకి పోటీగా మిట్టపల్లి..

జూన్ 2న తాము రిలీజ్ చేయబోయే గీతమే అసలు సిసలైన తెలంగాణ సాంగ్ అంటోంది మిట్టపల్లి టీం. జూన్ 2న తెలంగాణ తల్లికి ఈ పాటను అంకితం చేయనున్నారు మిట్టపల్లి సురేందర్.

Advertisement
Update: 2024-05-29 09:12 GMT

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రూపొందిస్తున్న జయజయహే గీతంపై వివాదం కొనసాగుతోంది. ఆంధ్ర వ్యక్తి అయిన కీరవాణికి మ్యూజిక్ డైరెక్షన్ బాధ్యతలు అప్పగించడంపై తెలంగాణ వాదులు రగిలిపోతున్నారు. ఇంకెంతకాలం మనపై ఈ ఆంధ్రుల పెత్తనమని ప్రశ్నిస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రం, మన పాట అంటూ తెలంగాణ వాదులు తమ గొంతుకను వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అందెశ్రీ, కీరవాణికి పోటీగా మిట్టపల్లి సురేందర్ రంగంలోకి దిగారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న అసలు సిసలైన తెలంగాణ గేయం రిలీజ్ చేయబోతున్నామని మిట్టపల్లి టీం ప్రకటించింది.

జూన్ 2న తాము రిలీజ్ చేయబోయే గీతమే అసలు సిసలైన తెలంగాణ సాంగ్ అంటోంది మిట్టపల్లి టీం. జూన్ 2న తెలంగాణ తల్లికి ఈ పాటను అంకితం చేయనున్నారు మిట్టపల్లి సురేందర్. తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న రాష్ట్ర గీతంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో అందెశ్రీ, కీరవాణికి పోటీగా మిట్టపల్లి సురేందర్ రంగంలోకి దిగడం హాట్‌ టాపిక్‌గా మారింది. మిట్టపల్లి పాట ఎలా ఉండబోతోందనే దానిపై జనాల్లో ఆసక్తి నెలకొంది.

Tags:    
Advertisement

Similar News