హైదరాబాద్: బయోటెక్ కంపెనీలో భారీ పేలుడు

హైదరాబాద్ జీడిమెట్లలోని శ్రీధర్ బయో టెక్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 7 గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement
Update:2022-08-22 12:21 IST

హైదరాబాద్ లోని ఓ బయోటెక్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి.

జీడిమెట్లలోని శ్రీధర్ బయోటెక్ కంపెనీలో ఒకే సారి ఐదు రియాక్టర్లు భారీ శబ్దంతో పేలిపోయాయి. ఈ ఘటన‌లో 7 గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డట్టు ఫైర్ ఆఫీసర్ సుభాష్ రెడ్డి తెలిపారు.తీవ్రంగా గాయపడ్డ‌ లక్ష్మణ్ నాయుడు, వెంకట రమణారెడ్డి, ప్రవీణ్, కృష్ణ రెడ్డి, జమీర్ నరసింహ రావు, శంకర్ అనే కార్మికులను ఆస్పత్రికి తరలించారు. ఇందులో నలుగురిని గురు సుజన ఆసుపత్రికి, మరో ముగ్గురిని గురు రామ్ ఆసుపత్రికి తరలించినట్లు సుభాష్ రెడ్డి చెప్పారు.

కాగా ఈ సంఘటన‌కు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    
Advertisement

Similar News