తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్న్యూస్
ఎండాకాలం నేపథ్యంలో ఈనెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నట్లు తెలిపిన విద్యాశాఖ;
Advertisement
తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పింది. ఎండాకాలం నేపథ్యంలో ఈనెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నట్లు తెలిపింది. విద్యా సంవత్సరం ముగిసే వరకు ఒంటిపూడ బడులు కొనసాగనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు స్కూళ్లు పనిచేయనున్నాయి. పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో ఒంటిగంట నుంచి సాయంత్రం 5 వరకు క్లాసులు జరగనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
Advertisement