తిరుప‌తి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. నలుగురు మృతి

తిరుగు ప్రయాణంలో తాటికొండ వద్ద ఆగివున్న డీసీఎంను వెనుక నుంచి వీరి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకట రమ‌ణ‌, కెంపురావు, అశోక్‌ యాదవ్‌ అక్కడికక్కడే మృతి చెందారు.

Advertisement
Update: 2024-08-29 13:55 GMT

తిరుప‌తి దైవదర్శనం కోసం వెళ్లి తిరిగివస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఆగివున్న డీసీఎం వాహనాన్ని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని భూత్పూర్‌ మండలం తాటికొండ వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

హైదరాబాద్‌లోని జిల్లెలగూడ ప్రాంతానికి చెందిన ఉరుసుల వెంకట రామారావు (43) ఆస్ట్రేలియా నుంచి ఇటీవలే హైదరాబాదుకు వచ్చారు. తిరుపతిలో దైవదర్శనం నిమిత్తం మూడు రోజుల క్రితం తల్లి సువర్ణ లక్ష్మీ, తండ్రి ఉరుసుల కెంపురావు (75), చెల్లెలు ఆవుల అంబిక, బావ ఆవుల అశోక్‌ యాదవ్‌ (48), మేనల్లుడు ఆవుల శ్రేయ అగ్రన్య, మేనకోడలు ఆవుల అక్షిత, మరో స్నేహితుడు వెంకటరమణ (43)తో కలిసి కారులో వెళ్లారు.

తిరుగు ప్రయాణంలో తాటికొండ వద్ద ఆగివున్న డీసీఎంను వెనుక నుంచి వీరి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకట రమ‌ణ‌, కెంపురావు, అశోక్‌ యాదవ్‌ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా.. వారిని మహబూబ్‌ నగర్‌ జిల్లా ఆస్ప‌త్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకట రామారావు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు భూత్పూర్‌ ఎస్సై చంద్రశేఖర్‌ చెప్పారు.

Tags:    
Advertisement

Similar News