హైదరాబాద్‌ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు

నేటి నుంచి ప్రారంభం.. ఒక్క నెలలోనే ఏడు కొత్త సర్వీసులు ప్రారంభించడంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హర్షం

Advertisement
Update:2024-09-27 13:39 IST

ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్‌ నుంచి ఆయోధ్య, కాన్పూర్‌, ప్రయాగరాజ్‌ ప్రాంతాలకు విమాన సర్వీసులు నేడు ప్రారంభం కానున్నాయి. నేటి (సెప్టెంబర్‌ 27) నుంచి హైదరాబాద్‌-కాన్పూర్‌, హైదరాబాద్‌-అయోధ్య మధ్య వారానికి నాలుగు రోజులు సర్వీసును, రేపటి (సెప్టెంబర్‌ 28) నుంచి హైదరాబాద్‌-ప్రయాగరాజ్‌, హైదరాబాద్‌-ఆగ్రా మధ్య వారానికి మూడు రోజుల సర్వీస్‌ను ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌ నుంచి ఇలా ఒక్క నెలలోనే ఏడు నూతన సర్వీసులు ప్రారంభించడంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నూతన సర్వీసులు ఆయా నగరాల మధ్య ప్రయాణికుల డిమాండ్‌ను నెరవేరేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కొత్త సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి కోరారు. 

Tags:    
Advertisement

Similar News