చేప ప్రసాదం పంపిణీ.. ఎప్పుడు, ఎక్కడ?

పూజ కార్యక్రమాలు, ప్రసాదం తయారీ దూద్‌బౌలిలో జూన్ 7వ తేదీన జరుగుతాయని చెప్పారు. వివిధ ఫౌండేషన్ల సహకారంతో మెడికల్ సర్వీస్, భోజనం, మంచినీటి సరఫరా 24 గంటల పాటు ఉచితంగా భక్తులకు ఇస్తామని చెప్పారు.

Advertisement
Update:2024-05-20 16:00 IST

ఏటా మృగశిర కార్తె సమయంలో బత్తిని ఫ్యామిలీ చేప ప్రసాదం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా చేప ప్రసాదం పంపిణీకి బత్తిని ఫ్యామిలీ సిద్ధమైంది. ఈ ఏడాది మృగశిర కార్తె జూన్ 8న శనివారం ఉదయం 11 గంటలకు ప్రవేశిస్తుంది. ఈ సందర్భంగా జూన్‌ 8 ఉదయం 11 గంటల నుంచి జూన్ 9వ తేదీ ఉదయం 11 గంటల వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎప్పటిలాగే చేప ప్రసాదం భక్తులకు ఉచితంగా అందిస్తామన్నారు.

పూజ కార్యక్రమాలు, ప్రసాదం తయారీ దూద్‌బౌలిలో జూన్ 7వ తేదీన జరుగుతాయని చెప్పారు. వివిధ ఫౌండేషన్ల సహకారంతో మెడికల్ సర్వీస్, భోజనం, మంచినీటి సరఫరా 24 గంటల పాటు ఉచితంగా భక్తులకు ఇస్తామని చెప్పారు. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు చేప మందు ప్రసాదాన్ని అందిస్తున్నామని చెప్పారు. చేప ప్రసాదం పంపిణీకి గత ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేసిన విధంగానే ఈ ప్రభుత్వం కూడా చేయాలని కోరారు.

వాళ్లు తయారు చేసిన ప్రసాదంలో బతికి ఉన్న చేపను ముంచి.. వచ్చిన జనం నోట్లో వేస్తుంటారు. ఈ చేప ప్రసాదం కోసం కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి సైతం వేలల్లో జనం వస్తుంటారు. ఈ నేపథ్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భారీ ఏర్పాట్లు చేయనున్నారు.

Tags:    
Advertisement

Similar News