అమ్మవారి విగ్రహం ధ్వంసం.. సికింద్రాబాద్‌‌లో తీవ్ర ఉద్రిక్తత

సికింద్రాబాద్ మోండా మర్కెట్ కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నాది. ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ముగ్గురిలో ఒకరిని పట్టుకుని దేహశుద్ధిచేశారు.

Advertisement
Update:2024-10-14 15:18 IST

సికింద్రాబాద్ మోండా మర్కెట్ కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నాది. ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ముగ్గురిలో ఒకరిని పట్టుకుని దేహశుద్ధిచేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదుచేసిన పోలీసులు పరారైన వారి కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కాగా, విషయం తెలుసుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులు హిందూ సంఘాల కార్యకర్తలు ఆలయం వద్దకు భారీగా చేరుకున్నారు. గుడిపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆలయాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. 

Tags:    
Advertisement

Similar News