అత్తామామలను చంపేస్తే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని..

ప్లాన్ ప్రకారం ఇంట్లోకి చొరబడ్డ నిందితులు మహిళ అత్తామామలపై దాడికి దిగారు. అందరూ చూస్తుండగానే కత్తులు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు.

Advertisement
Update: 2024-05-17 09:49 GMT

హైదరాబాద్ బేగంబజార్‌లో దారుణం జరిగింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఏకంగా అత్తామామలనే చంపించేందుకు కోడలు ప్రయత్నించింది. ఇందుకోసం సుపారీ గ్యాంగ్‌ను నియమించుకుంది. బేగంబజార్ కట్టెల మండీలో జరిగిన ఈ ఘటన షాక్‌ గురిచేస్తోంది. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి.

100కు డయల్ చేసినా..

ప్లాన్ ప్రకారం ఇంట్లోకి చొరబడ్డ నిందితులు మహిళ అత్తామామలపై దాడికి దిగారు. అందరూ చూస్తుండగానే కత్తులు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డుకోబోయిన మహిళ భర్తను సైతం కొట్టారు. బాధితులు కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. తీవ్ర గాయాలైన ముగ్గుర్ని ఆస్ప‌త్రికి తరలించారు. తమపై దాడి జరిగిన వెంటనే డయల్ 100కు ఫోన్ చేశామని బాధితులు చెబుతున్నారు. కానీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కిలాడీ కోడల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News