ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం.. మనుషుల ఆనవాళ్లు లభ్యం!
ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డి-2 అనే పాయింట్లో మనుషుల ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించినట్లు సమాచారం;
Advertisement
నాగర్కర్నూల్ జిల్లాలో కూలిన ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలో గల్లంతైన వారిని గుర్తించడంలో కొంత పురోగతి లభించింది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డి-2 అనే పాయింట్లో మనుషుల ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో సిబ్బంది జాగ్రత్తగా మట్టిని తొలగిస్తున్నారు. గల్లంతైన వారిలో కొందరిని నేడు సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉన్నది. ఆనవాళ్లు లభించడాన్ని ఇంకా అధికారులు అధికారికంగా ధృవీకరించలేదు.
Advertisement