ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
రాష్ట్రంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు
తెలంగాణలో ఇసుక అక్రమ రవాణాపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాండ్ అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపాలని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. ఇసుక రీచ్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టం చేశారు. ఓవర్ లోడ్, అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేపట్టాలని, ప్రభుత్వ ఆదాయానికి అక్రమార్కులు గండికొట్టకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి జిల్లాల్లో ప్రత్యేకంగా ఇసుక రవాణాపై స్పెషల్ మానిటరింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. పేదల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం అందిస్తుండగా.. ఖర్చును తగ్గించేందుకు గాను ఇసుకను ఉచితంగా ఇవ్వాలని డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉచిత ఇసుక సరఫరాపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు నలుగురు ఉన్నతాధికారులతో కమిటీని కూడా ఏర్పాటు చేశారు