స్కిల్‌ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా.. సీఎం రేవంత్ ప్రకటన

వర్సిటీ కోసం మొత్తం 57 ఎకరాల స్థలం కేటాయించారు. రూ.100 కోట్ల నిధులను విడుదల చేశారు. వచ్చే ఏడాది నుంచి ఇక్కడి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి.

Advertisement
Update: 2024-08-05 07:46 GMT

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న యంగ్‌ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఉంటారని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. రెండు రోజుల్లో ఆయన బాధ్యతలు తీసుకుంటారని చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి NRIలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు.

ఈనెల 1న రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలో యంగ్‌ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పబ్లిక్ ప్రైవేట్‌ భాగస్వామ్యంతో ఈ యూనివర్సిటీ నిర్మించనున్నారు. వర్సిటీ కోసం మొత్తం 57 ఎకరాల స్థలం కేటాయించారు. రూ.100 కోట్ల నిధులను విడుదల చేశారు. వచ్చే ఏడాది నుంచి ఇక్కడి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. మొత్తం 17 కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఏడాదికి సగటున రూ.50 వేల ఫీజు ఉంటుందని సమాచారం.

రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డితో ఆనంద్ మహీంద్రా సమావేశమయ్యారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఆటోమోటివ్ విభాగాన్ని అడాప్ట్ చేసుకునేందుకు ఆనంద్ మహీంద్రా అంగీకరించారు. త్వరలోనే స్కిల్‌ యూనివర్సిటీని పరిశీలించేందుకు తన టీమ్‌ను పంపుతానన్నారు ఆనంద్ మహీంద్రా.

Tags:    
Advertisement

Similar News