మరో 36 సభలకు కేసీఆర్‌.. 25న గ్రేటర్‌లో భారీ బహిరంగ సభ

గ్రేటర్ హైదరాబాద్‌లోని నియోజకవర్గాలన్నింటికి కలిపి పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఈనెల 25న భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ ప్లాన్‌ చేస్తోంది.

Advertisement
Update: 2023-11-19 02:54 GMT

అసెంబ్లీ ఎన్నిక‌ల‌ ప్ర‌చారంలో భాగంగా సుడిగాలి పర్యటనలతో నియోజకవర్గాలను చుట్టేస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌.. ప్రచారపర్వం ముగిసేనాటికి మరో 36 ప్రజా ఆశీర్వాద బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. అక్టోబర్‌ 15న హుస్నాబాద్‌లో ప్రారంభమైన ప్ర‌జా ఆశీర్వాద‌ సభలు శనివారం నాటి జనగామ నియోజకవర్గంలోని చేర్యాల సభతో 60కి చేరాయి. రోజుకు మూడు, నాలుగు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు కేసీఆర్. తనదైన ప్రసంగాలతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఈనెల 28న తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ఎండ్‌ కార్డు పడనుంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లోని నియోజకవర్గాలన్నింటికి కలిపి పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఈనెల 25న భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ ప్లాన్‌ చేస్తోంది. ఇందుకోసం పార్టీ శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. భారీ జన సమీకరణకు ప్లాన్ చేస్తున్నారు నేతలు.

ఓ వైపు కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలతో పాటు కేటీఆర్‌, హరీష్‌ రావు రోడ్‌ షోలతో బీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ విషయంలో మిగిలిన రెండు పార్టీలు కాస్త వెనుకబడ్డాయనే చెప్పొచ్చు. ఢిల్లీ నేతలు వస్తే తప్ప బీజేపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇతర నియోజకవర్గాల్లో ప్రచారానికి వెళ్లడం లేదు.

Tags:    
Advertisement

Similar News