అమన్గల్లో నేడు బీఆర్ఎస్ రైతు ధర్నా
పాల్గొననున్న కేటీఆర్, మాజీ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు
Advertisement
రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకోసం రంగారెడ్డి జిల్లా అమన్గల్లో నేడు బీఆర్ఎస్ రైతు ధర్నా చేపట్టనున్నది. ఇప్పటికే వివిధ చోట్ల దీక్ష చేపట్టిన బీఆర్ఎస్ కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో ధర్నా తలపెట్టింది. పోలీసులు ఈ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నది. మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్షకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు నేతలు ఈ ధర్నాకు హాజరుకానున్నారు.
Advertisement