ప్రభుత్వ వ్యతిరేకతను డైవర్ట్‌ చేయడానికే ఆరోపణలు : హరీశ్‌ రావు

ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్‌ చేయడానికి ఎలాంటి రుజువులు లేకుండా అనిల్ కుమార్ యాదవ్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడని మాజీ మంత్రి హరీశ్‌ రావు మండిపడ్డారు.

Advertisement
Update:2024-09-30 12:45 IST

తెలంగాణ ప్రజా సమస్యలపై అను నిత్యం పోరాడుతున్న నాపై బురద చల్లె వికృత రాజకీయాలకి తెరలేపినట్లు ఉందని మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్‌ చేయడానికి గోబెల్స్‌ ప్రచారాన్ని ఆశ్రయిస్తున్నారని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌పై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిమాయత్ సాగర్‌లో ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న ఆనంద కన్వెన్షన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌ రావుకు వాటాలు ఉన్నాయంటూ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌ ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలపై హరీశ్‌ రావు ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఎలాంటి రుజువులు లేకుండా అనిల్ కుమార్ యాదవ్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. తనకు గోల్కొండ, చార్మినార్‌లో కూడా వాటాలు ఉన్నాయని అంటారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. అబద్ధపు ప్రచారాలు చేస్తున్న అనిల్‌ కుమార్‌ యాదవ్‌కు లీగల్‌ నోటీసు పంపుతున్నా.. బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News