గంగవ్వపై కేసు నమోదు..ఎందుకో తెలుసా?

మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్‌లో రామ చిలుకని ఉపయోగించి గంగవ్వ, యూట్యూబర్ రాజు వీడియె చేశారని అటవీశాఖ అధికారులు కేసు న‌మోదు చేశారు.

Advertisement
Update:2024-10-23 18:36 IST

తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ, యూట్యూబర్ రాజుపై పోలీస్ కేసు న‌మోదు అయ్యింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం (1972) కింద కేసు నమోదైనట్లు తెలుస్తోంది. మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్‌లో రామ చిలుకని బంధించి యూట్యూబర్ రాజు, గంగ‌వ్వ క‌లిసి ఒక వీడియో చేశారు. మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్‌లో రామ చిలుకని ఉపయోగించి యూట్యూబర్ రాజు, గంగ‌వ్వ క‌లిసి ఒక వీడియో చేశారు. అయితే ఈ వీడియోలో యూట్యూబ్ ‌ప్రయోజనాల కోసం రామ చిలుకను హింసించి వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972ను ఉల్లంఘించారంటూ స్టేట్ యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ జంతు సంరక్షణ కార్యకర్త అదులాపురం గౌతమ్ అనే వ్య‌క్తి జగిత్యాల‌ పారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ కంప్లైంట్ తీసుకున్న అటవీశాఖ అధికారులు గంగవ్వతో పాటు యూట్యూబ్ రాజుల‌పై కేసు న‌మోదు చేశారు. అయితే వీడియో కోసం ఈ చిలుక‌ను కొండగట్టు దేవాలయం సమీపంలోని ఓ జ్యోతిష్యుడు దగ్గర నుంచి తెచ్చినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News