సీఎం రేవంత్ సొంత గనుల శాఖలో రూ.150 కోట్ల అవినీతి : కేటీఆర్

సీఎం రేవంత్ సొంత గనుల శాఖలో రూ.150 కోట్ల విలువైన ఇసుకను దోచుకున్న ఇంటిదొంగలపై దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.

Advertisement
Update:2024-09-28 14:03 IST

ముఖ్యమంత్రి సొంత గనుల శాఖలో రూ.150 కోట్ల అవినీతి జరిగిందని.. కోట్లాది రూపాయల విలువైన ఇసుక స్కామ్‌పై దర్యాప్తు జరిపించి, కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.ఫేక్ డాక్యుమెంట్లు, నకలీ రసీదులు సృష్టించి తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 150 కోట్ల విలువచేసే 1,50,000 టన్నుల ఇసుకను దోచేశారని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అవసరాల కోసం అంటూ తప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఇసుకను ఇంటి దొంగలు…దారి మళ్లించారని కేటీఆర్‌ తెలిపారు.

సీఎం సొంత శాఖలోనే జరిగిన ఈ కుంభకోణం, ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా జరగదని పేర్కొన్నారు. వెంటనే ఈ శాండ్ మాఫియా దొంగలెవరో దర్యాప్తు జరిపించి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానంటూ కేటీఆర్‌ పోస్ట్‌ పెట్టారు. దీంతో… రేవంత్ రెడ్డి గనుల శాఖలో నే రూ. 150 కోట్ల అవినీతి పై అందరూ చర్చించు కుంటున్నారు. మూసీ రివర్ డెవలప్మెంట్ లో సీఎం రేవం త్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నాడరని ఆగ్రహం వ్యక్తం చేశారు

Tags:    
Advertisement

Similar News