భారీ సంఖ్యలో నక్సల్స్‌ లొంగుబాటు.. – వారిలో ఐదుగురి తలలపై రూ.28 లక్షల రివార్డు

శంబటి అనే మహిళ 2012 నుంచి ఉద్యమంలో చురుగ్గా ఉండేవారని, 2020లో సుక్మా జిల్లాలో, 2021లో బీజాపూర్‌లో భద్రతా సిబ్బందిపై జరిగిన భారీ దాడుల ఘటనల్లో ఆమె పాత్ర ఉందని ఎస్పీ తెలిపారు.

Advertisement
Update: 2024-08-26 14:00 GMT

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో 25 మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిలో ఐదుగురి తలలపై మొత్తంగా రూ.28 లక్షల రివార్డు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మావోయిస్టు)కు చెందిన వీరంతా గంగ్లూర్, భైరామఢ్‌ ఏరియా కమిటీల్లో క్రియాశీలకంగా పనిచేసేవారని, వీరిలో ఇద్దరు మహిళలు సైతం ఉన్నారని బీజాపుర్‌ ఎస్పీ జితేంద్ర కుమార్‌ యాదవ్‌ సోమవారం తెలిపారు.

లొంగిపోయినవారిలో శంబటి మద్యం (23), జ్యోతి పునెం (27), మహేశ్‌ తేలంలపై ఒక్కొక్కరి తలపై రూ.8 లక్షల చొప్పున రివార్డు ఉందని ఎస్పీ వెల్లడించారు. విష్ణు కర్తమ్‌ అలియాస్‌ మోను, జైదేవ్‌ పొడియంలపైనా రివార్డు ఉన్నట్టు ఆయన తెలిపారు. మావోయిస్టు భావజాలం పట్ల నిరాశ, ఉద్యమ నేతల దౌర్జన్యాలను ఎత్తిచూపుతూ వారు లొంగిపోయారని ఎస్పీ చెప్పారు.

శంబటి అనే మహిళ 2012 నుంచి ఉద్యమంలో చురుగ్గా ఉండేవారని, 2020లో సుక్మా జిల్లాలో, 2021లో బీజాపూర్‌లో భద్రతా సిబ్బందిపై జరిగిన భారీ దాడుల ఘటనల్లో ఆమె పాత్ర ఉందని ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం లొంగిపోయిన వారికి ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున సాయంతో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసాన్ని కల్పిస్తామని ఆయన చెప్పారు. బీజాపూర్‌ జిల్లాలో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 170 మంది సరెండర్‌ కాగా.. 346 మంది నక్సలైట్లు అరెస్టయ్యారని ఆయన వివరించారు.

Tags:    
Advertisement

Similar News