ఆగిన మూసీ నిర్వాసితుని గుండె

ఇంటిని కూల్చివేస్తారనే హైరానాతో మృతిచెందిన శ్రీ కుమార్‌

Advertisement
Update:2024-10-02 16:35 IST

మూసీ ప్రాజెక్టులో తన ఇంటిని కూల్చేస్తారనే ఆందోళనతో నిర్వాసితుని గుండె ఆగింది. అంబర్‌ పేట్‌ నియోజకవర్గం న్యూ తులసీరామ్‌ నగర్‌ లంకకు చెందిన గానద శ్రీ కుమార్‌ (51) బుధవారం తెల్లవాజామున గుండెపోటుతో మృతిచెందారు. రెవెన్యూ అధికారులు తమ బస్తీలో ఇండ్లను సర్వే చేసి మార్కింగ్‌ చేస్తుండటంతో శ్రీ కుమార్‌ మనస్థాపానికి గురయ్యారు. ఐదారు రోజులుగా సరిగా తినడం లేదు. ఈక్రమంలో బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు చాతిలో నొప్పి వస్తుందని కుటుంబ సభ్యులకు చెప్పారు. వాళ్లు ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయారు. మృతుడికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆయన మృతితో లంక బస్తీలో విషాదం అలుముకుంది. మూసీ కూల్చివేతలతో ప్రభుత్వం నిండు ప్రాణాన్ని బలిగొందని బస్తీ వాసులు మండిపడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News