భూవివాదంవల్లే రాజలింగమూర్తి హత్య
భూపాలపల్లిలో హత్యకు గురైన రాజలింగమూర్తి హత్యను ఛేదించిన పోలీసులు
Advertisement
భూపాలపల్లిలో హత్యకు గురైన రాజలింగమూర్తి హత్యకేసును పోలీసులు ఛేదించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం అంటూ కేసు వేసిన రాజలింగమూర్తి బుధవారం హత్యకు గురైన విషయం విదితమే. ఈ కేసు వివరాలను పోలీసులు ఆదివారం వెల్లడించారు. జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే మాట్లాడుతూ.. ఎకరం భూవివాదం వల్లే రాజలింగమూర్తి హత్య జరిగింది. 10 మంది నిందితుల్లో ఏడుగురిని అరెస్టు చేశాం. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని వెల్లడించారు. నిందితుల నుంచి 2 కత్తులు, 2 రాడ్లు, 5 బైక్లు, 7 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు కలిసి హత్య చేయగా ఇద్దరు రెక్కీలో పాల్గొన్నారు. మిగతా వారు వారికి సహాయం చేశారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నదని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Advertisement