బాలానగర్‌లో అగ్ని ప్రమాదం..ఒకరు మృతి

బాలానగర్ లోని ఓ ఇంటిలో అగ్ని ప్రమాదం జరిగింది.

Advertisement
Update:2025-02-02 10:40 IST

మేడ్చల్ జిల్లా బాలానగర్ లోని ఓ ఇంటిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఒకరు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనలో ఏపీకి చెందిన జలగం సాయి సత్య శ్రీనివాస్ ఇంటిలో మంటలు చెలరేగడంతో, అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. ఇక ఈ సంఘటన బాలానగర్‌ లో కలకలం రేపుతోంది. పటాన్ చెరు రుద్రారంలోని ఓ కెమికల్ కంపెనీలో పని చేస్తున్నాడు సత్య శ్రీనివాస్. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై విచారణ జరుగుతున్నారు పోలీసులు. శ్రీనివాస్ ఆత్మహత్య పాల్పడ్డారా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News