బీజేపీలో చేరిన బాబూ మోహన్‌

టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాబూ మోహన్ టీఆర్‌ఎస్‌ను వీడారు. బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు.  సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ దాదాపుగా టికెట్లు ఓకే చేసిన కేసీఆర్‌… బాబూ మోహన్‌కు మాత్రం టికెట్‌ ఇవ్వలేదు. దీంతో ఆయన నొచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరారు. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరపున అందోల్‌ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనరసింహ పై గెలుపొందారు. కానీ ఈసారి టికెట్ […]

Advertisement
Update: 2018-09-29 02:33 GMT
టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాబూ మోహన్ టీఆర్‌ఎస్‌ను వీడారు. బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ దాదాపుగా టికెట్లు ఓకే చేసిన కేసీఆర్‌… బాబూ మోహన్‌కు మాత్రం టికెట్‌ ఇవ్వలేదు. దీంతో ఆయన నొచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరారు.
2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరపున అందోల్‌ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనరసింహ పై గెలుపొందారు. కానీ ఈసారి టికెట్ నిరాకరించారు. తాను కష్టపడి పనిచేసినా పట్టించుకోకుండా అవమానించారని బాబుమోహన్ అనుచరుల వద్ద వాపోయారు. ఆయన వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
Tags:    
Advertisement

Similar News