యాదగిరిగుట్ట మహా కుంభాభిషేకానికి కేసీఆర్‌కి ఆహ్వానం

యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేకానికి మాజీ సీఎం కేసీఆర్‌కి ఆలయ అర్చకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు

Advertisement
Update:2025-02-21 21:14 IST

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేకానికి మాజీ సీఎం కేసీఆర్‌కి ఆలయ అర్చకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ మేరకు యాదగిరిగుట్ట దేవస్థానం ప్రధాన పూజారి, ఆలయ కార్యనిర్వహణ అధికారులతో కూడిన బృందం శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం స్వర్ణ విమాన గోపురానికి ఈ నెల 23న మహా కుంభాభిషేకం కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ని ఆలయ పూజారులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. అనంతరం మార్చి 1 నుంచి 11 వరకు జరిగే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా కేసీఆర్‌ని కోరారు.

Tags:    
Advertisement

Similar News