Andhra Pradesh

రాష్ట్రంలో ప్రభుత్వం మారాక గత 45 రోజుల్లో 36 హత్యలు జరిగాయన్నారు జగన్. 300కి పైగా హత్యాయత్నాలు జరిగాయని, టీడీపీ వేధింపులు తట్టుకోలేక 35మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు.

పనికంటే ప్రచారం ఎక్కువ అనే ఆరోపణలు ఉన్నా కూడా చంద్రబాబు ఎందుకో ఈ సంప్రదాయాన్నే కొనసాగించేవారు. సభలకంటే ఆయన సమీక్షలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.

ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పలపై టీడీపీ నేతలు హత్యాయత్నం కేసులు పెట్టారు. ఒకవైపు వైసీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్న టీడీపీ గూండాలు.. ఎవరిపై దాడులకు పాల్పడుతున్నారో వారిపైనే తిరిగి కేసులు పెడుతుండటంపై మాజీ ఎంపీ రెడ్డప్ప మండిపడ్డారు.

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గురువారం మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టారు.

తాను ఎంత చెప్పినా తండ్రి మొండిగా వ్యవహరిస్తున్నాడనే కోపంతో రఘునాథరెడ్డి ఆయన్ని తన కారుతో ఢీకొట్టి అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని బెంగళూరులో ఉన్న తమ్ముడు శంకర్‌రెడ్డికి ఫోన్‌ చేసి చెప్పాడు.

వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని, వారి మాయలో పడొద్దని, వారు రెచ్చగొట్టినా సంయమనం పాటించాల్సిన బాధ్యత టీడీపీ, జనసేన కార్యకర్తలపై ఉందని అన్నారు హోం మంత్రి అనిత.