కొనసాగుతున్న రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

అభ్యర్థి విజయానికి 1,11,672 ఓట్లు కావాలి;

Advertisement
Update:2025-03-05 14:30 IST

కరీంనగర్‌-నిజామాబాద్‌-మెదక్‌-ఆదిలాబాద్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. విజయానికి కావాల్సిన ఓట్లు ఎవరికీ రాకపోవడంతో రిటర్నింగ్‌ అధికారి ఎలిమినేషన్‌ ప్రక్రియ ప్రారంభించారు. ఎలిమినేషన్‌ ద్వారా ఇప్పటివరకు 29 మందిని ఎలిమినేట్‌ చేశారు. తొలి ప్రాధాన్యత చెల్లుబాటు అయిన ఓట్లు 2,23,343 కాగా.. 28,686 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. అభ్యర్థి విజయం సాధించడానికి 1,11,672 ఓట్లను సాధించాల్సి ఉంటుంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి మొత్తంగా 75,675 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి 70,565 ఓట్లు పోలయ్యాయి. తొలి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థి 5,110 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 60,419 ఓట్లు పోలయ్యాయి.

Tags:    
Advertisement

Similar News