తెలంగాణ ఇంటర్ పరీక్షలు షురూ
ఉదయం 9 గంటటల ఉంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్న పరీక్షలు;
Advertisement
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొన్నది. నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటటల ఉంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల వద్దకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉదయం 8 గంటలకే చేరుకున్నారు. ప్రతి విద్యార్థి హాల్టికెట్స్తో పాటు క్షుణ్ణంగా పరిశీలించాకే అధికారులు పరీక్ష హాల్లోకి అనుమతిస్తున్నారు. 9 గంటలు సమయం దాటినా 5 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను కూడా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు.
Advertisement