ఉగ్రవాదులకు రేవంత్ రెడ్డి నంబర్ ఇచ్చా - రాజాసింగ్

తనకు బెదిరింపు కాల్‌ చేసిన వ్యక్తి ఎన్ని నంబర్లున్నాయని అడిగితే రెండు నంబర్లు ఉన్నాయని చెప్పి.. ఒకటి సీఎం రేవంత్ రెడ్డి నంబర్ ఇచ్చానన్నారు రాజాసింగ్. ఇప్పటికైనా పోలీసులు చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలన్నారు.

Advertisement
Update:2024-05-29 19:52 IST

బీజేపీ ఎమ్మెల్యే, సీనియర్ నేత రాజాసింగ్‌కు గతంలో బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి తనను గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌కాల్‌లో బెదిరించినట్లు చెప్పారు రాజాసింగ్. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు రాజాసింగ్. తనకు కాల్ వచ్చిన నంబర్ల జాబితాను పోలీసులకు అందజేశారు. గతంలో వచ్చిన ఫోన్‌ కాల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకూ చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజాసింగ్.

తరచుగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాజాసింగ్. దీంతో తనకు బెదిరింపు కాల్‌ చేసిన వ్యక్తి ఎన్ని నంబర్లున్నాయని అడిగితే రెండు నంబర్లు ఉన్నాయని చెప్పి.. ఒకటి సీఎం రేవంత్ రెడ్డి నంబర్ ఇచ్చానన్నారు రాజాసింగ్. ఇప్పటికైనా పోలీసులు చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలన్నారు. ఈ రోజు కాల్‌ చేసిన వ్యక్తి పాలస్తీనా అని తెలుస్తోందన్నారు.

తనకు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తులను పట్టుకుని వారిని చట్టప్రకారం శిక్షించాలని రాజాసింగ్ కోరుతున్నారు. ధర్మం కోసం పనిచేస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని, అయినా తాను ఎవరి బెదిరింపులకు లొంగే ప్రసక్తి లేదన్నారు రాజాసింగ్.

Tags:    
Advertisement

Similar News