యాదాద్రికి పోటెత్తిన భక్తులు

ఆదివారం కావడంతో హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల నుంచి భారీగా భక్తుల రాక

Advertisement
Update:2024-09-29 15:34 IST

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం కావడంతో హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు తమ కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు మూలవరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సుదర్శన హోమం, నిత్య కల్యాణం, స్వర్ణ పుష్ప ఆరాధాన, అలంకార సేవోత్సవాలు జరిగాయి.

ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయంలో శైవాగమ ఆచారంగా నిత్య పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పాత గుట్ట ఆలయంలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని కొలుస్తూ నిజాభిషేకం, తులసీ అర్చన, నిత్య కల్యాణం జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయంలో రద్దీ నెలకొన్నది.


Tags:    
Advertisement

Similar News