రాణించిన మ‌హ‌మ్మ‌ద్ షమీ..భారత్ టార్గెట్ ఎంతంటే?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ 228 పరుగులకు అలౌటైంది.

Advertisement
Update:2025-02-20 18:20 IST

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో  బంగ్లాదేశ్ 228 పరుగులకు అలౌటైంది. తౌహీద్‌ హృదోయ్‌ సెంచరీ చేశాడు. మరో బంగ్లా బ్యాటర్ జాకర్ అలీ 68 పరుగులతో రాణించాడు. దీంతో బంగ్లా మెరుగైన స్కోరు సాధించింది. టీమిండియా బౌలర్లలో మ‌హ‌మ్మ‌ద్ షమీ 5 వికెట్ల, హర్షిత్ రాణా 3, అక్షర్ పటేలు 2 వికెట్లు తీశారు. భార‌త పేస్ బౌల‌ర్ మ‌హ‌మ్మ‌ద్ షమీ చ‌రిత్ర సృష్టించాడు. చాంపియ‌న్స్ ట్రోఫీ మ్యాచ్‌లో బంగ్లా బ్యాట‌ర్ జాకిర్ వికెట్ తీసి త‌న ఖాతాలో కొత్త రికార్డును వేసుకున్నాడు ష‌మీ. వ‌న్డేల్లో 200 వికెట్లు తీసిన స్పీడ్ బౌల‌ర్ అయ్యాడు. అత్యంత వేగంగా వ‌న్డేల్లో 200 వికెట్లు తీసిన బౌల‌ర్‌గా ష‌మీ నిలిచాడు

Tags:    
Advertisement

Similar News