నిత్యం దేవుడికి ప్రార్థన చేస్తున్నాడని శిక్ష తగ్గింపు.. హైకోర్టు సంచలన తీర్పు

పోక్సో కోర్టు విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చుతూ ఉత్తర్వులిచ్చింది. దీనికి సంబంధించి జూన్‌ 27న 106 పేజీల తీర్పును హైకోర్టు ఇచ్చింది.

Advertisement
Update: 2024-07-02 05:25 GMT

పోక్సో కోర్టులో ఉరిశిక్ష పడిన వ్యక్తికి శిక్షను తగ్గిస్తూ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈ తీర్పు సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎస్‌కే ఆసిఫ్‌ అలీ అనే వ్యక్తి ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి.. ఆ తర్వాత హత్య చేశాడు. ఈ ఘటనపై ఒడిశాలోని జగత్‌సింగ్‌పుర్‌లో ఉన్న పోక్సో కోర్టు నిందితుడిపై నేరం రుజువు కావడంతో అతనికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

తాజాగా ఈ కేసును విచారించిన ఒడిశా హైకోర్టు దోషికి పడిన శిక్షను కుదిస్తూ సంచలన తీర్పు చెప్పింది. అతనికి పోక్సో కోర్టు విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చుతూ ఉత్తర్వులిచ్చింది. దీనికి సంబంధించి జూన్‌ 27న 106 పేజీల తీర్పును హైకోర్టు ఇచ్చింది. ఈ సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఈ కేసులో దోషిగా తేలిన ఆసిఫ్‌ అలీ రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నాడని, అతడు దేవుడి ముందు లొంగిపోయాడని ధర్మాసనం పేర్కొంది. తాను చేసిన నేరాన్ని అంగీకరించడానికి అతను సిద్ధంగా ఉన్నాడని తెలిపింది. అందుకే అతడికి విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మారుస్తున్నామని వెల్లడించింది. ఈ కేసులో బాధిత బాలిక కుటుంబానికి రూ.1.50 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని పోక్సో కోర్టు ఆదేశించగా.. దాన్ని సవరించిన న్యాయస్థానం రూ.10 లక్షలు అందించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

Tags:    
Advertisement

Similar News