ఎయిమ్స్‌లో చేరిన ఉపరాష్ట్రపతి

ఆదివారం జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఛాతి నొప్పితో బాధపడినట్లు సమాచారం;

Advertisement
Update:2025-03-09 11:28 IST

ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఎయిమ్స్‌లో చేరారు. ఆదివారం ఆయన ఛాతి నొప్పితో బాధపడినట్లు సమాచారం. దీంతో ఆయనను తెల్లవారుజామున 2 గంటలకు ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కు తీసుకెళ్లారు. కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్‌ రాజీవ్‌ నారంగ్‌ ఆధ్వర్యంలో ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. 

Tags:    
Advertisement

Similar News