మహిళలకు నెలసరి సెలవులు - ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రస్తుతం బిహార్, కేరళ ప్రభుత్వాలు మాత్రమే మహిళా ఉద్యోగులకు ఈ నెలసరి సెలవులు ఇస్తున్నాయి. బిహార్ అయితే 1992లోనే ఈ సెలవుల విధానాన్ని తీసుకువచ్చింది.

Advertisement
Update: 2024-08-16 08:11 GMT

నెలసరి సమయంలో మహిళలు పడే ఇబ్బందులు బయటకు చెప్పుకోలేనివి. ఇక ఉద్యోగం చేసే వారికయితే ఆ సమయంలో వచ్చే చిరాకుకు తోడు పని ఒత్తిడి వారిని మరింత చికాకు పెడుతుంటుంది. ఈ నేపథ్యంలోనే నెలసరి రోజుల్లో మహిళలకు ఒకరోజు సెలవు ఇస్తున్నట్టు ఒడిశా రాష్ట్ర ప్రభత్వం అనౌన్స్ చేసింది. ప్ర‌భుత్వ, ప్రైవేట్ సంస్థ‌ల్లో ఉద్యోగాలు చేస్తున్న మ‌హిళ‌ల‌కు స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ తీపి కబురు చెప్పింది. మహిళలు నెలసరి సమయంలో మొదటి రోజు లేదా రెండో రోజు ఈ సెలవును ఉపయోగించుకోవచ్చు. గురువారం క‌ట‌క్‌లో జ‌రిగిన ఇండిపెండెన్స్ డే వేడుక‌ల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ సీఎం ఈ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉద్యోగినుల ఆరోగ్యం, శ్రేయస్సును కాంక్షిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఒడిశా రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న ఉద్యోగినులు ప్ర‌భుత్వ నిర్ణ‌యం ప‌ట్ల‌ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.


ప్రస్తుతం బిహార్, కేరళ ప్రభుత్వాలు మాత్రమే మహిళా ఉద్యోగులకు ఈ నెలసరి సెలవులు ఇస్తున్నాయి. బిహార్ అయితే 1992లోనే ఈ సెలవుల విధానాన్ని తీసుకువచ్చింది. అక్కడ ప్రస్తుతం ప్రతి నెలా రెండు రోజులు మహిళా ఉద్యోగులకు నెల‌స‌రి సెలవులు ఇస్తున్నారు. ఇక గతేడాది కేరళ ప్రభుత్వం విద్యార్థినులను నెలసరి సెలవులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థినులకు నెలసరి సెలవులు అమ‌లు చేస్తోంది. జొమాటో వంటి ప్రైవేట్ సంస్థ కూడా మహిళలకు సెలవులు ఇస్తోంది. 2020 నుంచే ఏడాదికి పది పెయిడ్ పీరియడ్ లీవ్స్‌లను జొమాటో అమలు చేస్తోంది. అయితే దేశవ్యాప్తంగా నెలసరి సెలవులకు సంబంధించి ఎలాంటి చట్టం లేదు. మహిళలకు నెలసరి సెలవులకు సంబంధించి 2022లోనే కేంద్రం ఓ బిల్లు తీసుకువచ్చింది. అయితే ఆ బిల్లు ఇప్పటికీ ఆమోదం పొందలేదు.

Tags:    
Advertisement

Similar News