ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం

రేఖా గుప్తాతో మంత్రులుగా కపిల్‌ మిశ్రా, పంకజ్‌కుమార్‌ సింగ్‌, పర్వేశ్‌ వర్మ, ఆశీష్‌ సూద్‌, మన్‌జిందర్‌ సింగ్‌, రవీందర్‌ ఇంద్రాజ్‌ ప్రమాణ స్వీకారం

Advertisement
Update:2025-02-20 12:48 IST

దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం మధ్యాహ్నం రామ్‌లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో సీఎంగా రేఖాగుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా.. రేఖా గుప్తాతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Tags:    
Advertisement

Similar News