అభ్యంతరకర ఆన్లైన్ కంటెంట్ నియంత్రణకు కఠిన నిబంధనలు
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ నిశికాంత్ దూబే రాసిన లేఖకు బదులిచ్చిన కేంద్రం
Advertisement
'ఇండియాస్ గాట్ లాంటెంట్' కార్యక్రమంలో యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన విషయం విదితమే. ఈ అంశాన్ని కేంద్రం సీరియస్గా తీసుకున్నది. ఈ క్రమంలో ఐటీ రూల్స్లోని (2021) కోడ్ ఆఫ్ ఎథిక్స్ను ఓటీటీలు, సోషల్ మీడియాలు తప్పనిసరిగా పాటించాలని కేంద్రం హెచ్చరించిన సంగతి తెలిసిందే. అలాగే ఆన్లైన్ కంటెంట్ నియంత్రణకు కఠిన నిబంధనలు అవసరమని భావిస్తున్నది. ఆ దిశగా ప్రస్తుతం ఉన్న చట్టాల్లో సవరించాల్సిన అంశాలు ఏమున్నాయో పరిశీలిస్తున్నది. అభ్యంతరకర ఆన్లైన్ సమాచార నియంత్రణకు డిమాండ్లు పెరుగుతున్నాయని పేర్కొన్నది. ఈ మేరకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ నిశికాంత్ దూబే రాసిన లేఖకు బదులిచ్చింది.
Advertisement