కాపీ కొట్టారంటే పదేళ్ల జైలు, కోటి జరిమానా

పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ బిల్లు-2024ను ఫిబ్రవరి 6న లోక్‌సభ ఆమోదించింది. 9న రాజ్యసభలో ఆమోదం పొందింది. అదే నెల 12న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.

Advertisement
Update:2024-06-22 10:44 IST

నీట్‌, యూజీసీ నెట్‌ పేపర్‌ లీకవ్వ‌డం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో పరీక్షల్లో అక్రమాల కట్టడికి ఉద్దేశించిన చట్టాన్ని కేంద్రప్రభుత్వం నోటిఫై చేసింది. వాస్తవానికి ప్రభుత్వ పరీక్షల చట్టం-2024కి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నాలుగు నెలల కిందటే ఆమోదముద్ర వేసినా.. కేంద్రం తాజాగా చట్ట నిబంధనలను నోటిఫై చేసింది. నిన్నటి నుంచే ఈ చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం పోటీ పరీక్షల్లో అక్రమాలు పాల్పడితే గరిష్టంగా పదేండ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అలాగే రూ.కోటి వరకు జరిమానా వేస్తారు.

నెట్‌, యూజీసీ పేపర్‌ లీకుల నేపథ్యంలో ఈ చట్టాన్ని నోటిఫై చేయడం ప్రాధాన్యత‌ సంతరించుకుంది. చట్టాన్ని ఎప్పుడు అమలు చేస్తారని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ని ప్రతిపక్షాలు ప్రశ్నించిన మరుసటి రోజే దీనిపై నోటిఫికేషన్‌ వెలువడింది. పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ బిల్లు-2024ను ఫిబ్రవరి 6న లోక్‌సభ ఆమోదించింది. 9న రాజ్యసభలో ఆమోదం పొందింది. అదే నెల 12న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. యూపీఎస్సీ, స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌, రైల్వేస్‌, బ్యాంకింగ్‌ రిక్రూట్‌మెంట్‌ ఎగ్జామ్స్‌, ఎన్టీఏ నిర్వహించే పరీక్షల్లో అక్రమాలను నిరోధించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.

Tags:    
Advertisement

Similar News