మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ
బీజేపీ 38, ఆప్ 24, కాంగ్రెస్ 1 స్థానంలో ఆధిక్యం
Advertisement
దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాల సరళి కనిపిస్తున్నది. ఆమ్ ఆద్మీ పార్టీతో పోలీస్తే బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్తున్నది. ఉదయం 9 గంటల వరకు వెలువడిన ఫలితాలు చూస్తుంటే.. ఆధిక్యాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ (36) దాటేసింది. ప్రస్తుతం కమలం పార్టీ 38 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నది. ఆప్ 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. కాంగ్రెస్ ఒక చోట ముందంజలో కొనసాగుతున్నది.
Advertisement