మెట్రో పోలీస్‌ హోటల్‌ యజమాని , మేనేజర్‌ అరెస్ట్‌

వ్యక్తిత్వ వికాసం పేరుతో యువకులను రెచ్చగొట్టిన మునావర్‌ గాలిస్తున్న పోలీసులు.. ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసానికి కారణం ఈ ప్రసంగాలేనని పోలీసుల నిర్ధారణ

Advertisement
Update:2024-10-20 20:23 IST

మెట్రో పోలీస్‌ హోటల్‌ యజమాని రషీద్‌, మేనేజర్‌ రెహమాన్‌ పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు మునావర్‌ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రషీద్‌ను ముంబయిలో అరెస్టు చేసినట్లు చెప్పారు. వ్యక్తిత్వ వికాసం పేరుతో మునావర్‌ యువకులకు క్లాస్‌లు నిర్వహించాడు. తన ప్రసంగాలతో యువకులను రెచ్చగొట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

మత విద్వేషాలకు వేదికగా నిలుస్తున్నదని పోలీసులు చేసిన సిఫార్సు మేరకు సికింద్రాబాద్‌లోని మెట్రో హోటల్‌ను ఇప్పటికే రెవెన్యూ అధికారులు సీజ్‌ చేశారు. ఇక్కడికి వ్యక్తిత్వ వికాస శిక్షణ కోసం వచ్చిన వ్యక్తే అక్కడి ప్రసంగాలకు ఆకర్షితుడై ఇటీవల కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో హోటల్‌ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ప్రాథమికంగా దొరికిన ఆధారాల ప్రకారం మెట్రో పోలీస్‌ హోటల్‌ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వేదికగా మారిందని, పోలీసుల అనుమతులు లేకుండా నెలరోజులుగా అక్కడ మత విద్వేష ప్రసంగాలు జరిగినట్లు తేలింది. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని ఉత్తర మండల డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్‌ సికింద్రాబాద్‌ ఆర్డీవోకు సిఫార్సు చేశారు. దీంతో సికింద్రాబాద్‌ తాహసీల్దార్‌ పాండు నాయక్‌, పోలీసు అధికారులతో కలిసి గురువారం హోటల్‌ను సీజ్‌ చేశారు. రూమ్‌ల్లో ఉన్నవారిని ఖాళీ చేయించారు. హోటల్‌లోని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.


Tags:    
Advertisement

Similar News