కుప్పకూలిన ఎస్ఎల్బీసీ సొరంగం!
ఐదారుగురు కూలీలు చిక్కుకున్నట్టు సమాచారం?
Advertisement
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ కుప్పకూలింది. టన్నెల్ బోరింగ్ మిషన్ కు సంబంధించిన పనులు చేస్తున్న క్రమంలోనే టన్నెల్ పైకప్పు ఒక్కసారిగా కూలిపోయినట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఐదారుగురు కూలీలు ఉన్నారని చెప్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ను తవ్వుతూ దానికి ప్యారలాల్గా లైనింగ్ పనులు చేస్తుంటారు. టన్నెల్ బోరింగ్ మిషన్ రిపేర్ల కారణంగా కొన్నాళ్లుగా పనులు చేయడం లేదు. ఎస్ఎల్బీసీ ఎడమ వైపు టన్నెల్ 14వ కి.మీ.ల వద్ద మూడు మీటర్ల మేర పైకప్పు కూలిపోయిదని చెప్తున్నారు. సిమెంట్ లైనింగ్ చేసిన భాగం ఎలా కూలిందనే వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement