పెళ్లికి వెళ్లొస్తున్న బస్సు-టెంపో ఢీ..12 మంది దుర్మరణం

రాజస్థాన్‌ ధోల్‌పుర్‌ జిల్లాలో వివాహ వేడుకలకు వెళ్తున్న బస్సును టెంపో డీ కొట్టడంతో 11 మంది మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

Advertisement
Update:2024-10-20 10:52 IST

రాజస్థాన్‌ ధోల్‌పుర్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మందిమృతి చెందారు. జాతీయ రహదారిపై పెళ్లి వేడుకలకు వెళ్తున్న బస్సును టెంపో డీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బారీ నగరంలోని కరీం కాలనీ గుమర్ మొహల్లాకు చెందిన నహ్నూ, జహీర్ తమ ఫ్యామిలీతో కలిసి బరౌలీ గ్రామంలో ఓ కార్యక్రమానికి నిన్న వెళ్లారు. కార్యక్రమం అనంతరం టెంపోలో రాత్రి తిరుగు ప్రయాణం అయ్యారు.

సునిపుర్ గ్రామ సమీపంలోని రాగానే వీరు ప్రయాణిస్తున్న టెంపోను ఎదురుగా అతి వేగంగా వస్తున్న స్పీపర్ బస్సు ఢీకొట్టింది. జాతీయ రోడ్డుపై వెళ్లే ఇతర వాహనాల డ్రైవర్లు వెంటనే ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మొత్తం 12 మంది మృతి చెందగా, మృతుల్లో ఐదుగురు బాలురు, ముగ్గురు బాలికలు, ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. అలాగే మరికొంత మందికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై రాజస్థాన్ ముఖ్యమంత్రి స్పందించి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. 

Tags:    
Advertisement

Similar News