ఏపీలో దారుణం.. అత్తా కోడలిపై అత్యాచారం

శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేష్‌న్ పరిధిలో దారుణం జరిగింది. అర్ధరాత్రి అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ జరిగింది.

Advertisement
Update:2024-10-12 12:54 IST

శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేష్‌న్ పరిధిలో దారుణం జరిగింది. నల్లబొమ్మనిపల్లి గ్రామంలో అత్తా కోడలిపై దుండుగులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిర్మాణంలో ఉన్న పేపర్ మిల్లులో ఓ ఫ్యామిలీ వాచ్‍మెన్‌గా ఉంటున్నరు. అర్థ రాత్రి ఐదుగురు గుర్తు తెలియని దుండగులు వాచ్‍మెన్‌ అతని కొడుకుపై దాడి చేసి అత్తా కోడలిపై అత్యాచారానికి ఒడిగట్టిరు. మోటార్ సైకిల్ లపై వచ్చిన ఐదు మంది.. రాత్రి సమయంలో సౌండ్ రావడంతో కుటుంబ సభ్యులు బయటకు వచ్చి టార్చ్ లైట్ వేసి గమనించి.. ఎందుకు ఇక్కడ ఉన్నారని అడిగినందుకు ఆ మహిళలు భర్తల పై దాడికి దిగినరు దుండగులు.

వెంటనే అక్కడి నుంచి వారు పరారీ అయ్యారు. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసి, కఠిన శిక్ష పడేలా చూస్తామని మంత్రి సవిత అన్నారు. మరో వైపు ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిప్పుడు నుంచి దళితులు, బడుగు బలహీన వర్గలపై అత్యాచారాలు, హత్యాలు, ఎక్కువయ్యాయి. రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతాలు అదుపు తప్పాయి. మొన్న డిప్యూటీ సీఎం సొంత ఇలాకాలో దళిత బాలికపై లైంగిక దాడి జరిగింది. సీఐ తల్లిని అతి దారుణంగా హత్య చేశారు.

Tags:    
Advertisement

Similar News