ఆటోలో ఎక్కించుకుని.. మహిళపై సామూహిక అత్యాచారం

నిజామాబాద్‌ జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన

Advertisement
Update:2024-10-19 12:23 IST

నిజామాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆటోలో మహిళను ఎక్కించుకుని తీసుకెళ్లిన వారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకోగా.. శనివారం ఉదయం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శుక్రవారం రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను పలువురు వ్యక్తులు ఆటోలో నిజామాబాద్‌ బస్టాండ్‌ వద్ద ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి డిచ్‌పల్లి ప్రాంతానికి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలు నగరానికి చేరుకుని శనివారం ఉదయం జిల్లా కేంద్రంలోని ఒకటో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన వారు డిచ్‌పల్లికి చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాధిత మహిళను వెంటబెట్టుకుని ఘటనాస్థలికి తీసుకెళ్లి పోలీసులు పరిశీలించారు. బస్టాండ్‌ వద్ద ఆటోకు సంబంధించిన వీడియో ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News