ప్రొటెం స్పీకర్ గా బుచ్చయ్య చౌదరి

ప్రొటెం స్పీకర్ హోదాలో బుచ్చయ్య చౌదరి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత, ఎమ్మెల్యే వైఎస్ జగన్ సహా సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Advertisement
Update:2024-06-19 13:29 IST

ఏపీ ప్రొటెం స్పీకర్ గా టీడీపీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంపికయ్యారు. గోరంట్లకు ఫోన్ చేసిన మంత్రి పయ్యావుల కేశవ్ తొలి అసెంబ్లీ సమావేశాల్లో ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించాలని కోరారు. దీనికి గోరంట్ల అంగీకారం తెలిపారు. రేపు గోరంట్ల బుచ్చయ్య చౌదరితో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

అనంతరం ప్రొటెం స్పీకర్ హోదాలో బుచ్చయ్య చౌదరి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత, ఎమ్మెల్యే వైఎస్ జగన్ సహా సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత స్పీకర్ ను ఎన్నుకోనున్నారు. స్పీకర్ గా టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు నియమితులు కానున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

కాగా, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పటికి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటి సభలో సీఎం చంద్రబాబు 9సార్లు ఎమ్మెల్యేగా నెగ్గగా, ఆయన తర్వాతి స్థానంలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన వ్యక్తిగా గోరంట్ల ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News