విశాఖపట్నంలో హయగ్రీవ సంస్థకు ఇచ్చిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నది. గతంలో హయగ్రీవ ఫార్మ్ అండ్ డెవలపర్స్ సంస్థకు 12.41 ఎకరాల భూమిని కేటాయించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు రుజువు కావడంతో ప్రభుత్వం ఆ భూకేటాయింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే భూములు స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ను ఆదేశించింది.
Advertisement