వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ రూ.44.74 కోట్ల ఆస్తులు సీజ్

వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రూ.44.74 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

Advertisement
Update:2025-02-07 16:52 IST

వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు భారీ షాక్ తగిలింది. విశాఖలోని హయగ్రీవ ఫామ్స్‌కు చెందిన రూ.44.74 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. వృద్ధులు, అనాథులకు సేవ చేసేందుకు కేటాయించిన హయగ్రీవ భూములను ఆయన దుర్వినియోగం చేసినట్లు ఈడీ గతంలో తెల్చింది. ప్లాట్లుగా విభజించి వేర్వేరు వ్యక్తులకు ఫేక్ డాక్యుమెంట్‌‌లతో విక్రయించినట్లు గుర్తించింది. హయాగ్రీవ భూముల అమ్మకాల్లో ఎంవీవీ, ఆయన ఆడిటర్ జీవీ, మేనేజింగ్ పార్టనర్ గద్దె బ్రహ్మాజీలు సూత్రధారులుగా ఈడీ తేల్చింది. ప్లాట్లు అమ్మి దాదాపు రూ.150 కోట్లు ఆర్జించినట్లు వెల్లడించింది.

ఎంవీవీ, జీవీ ఇళ్లు, కార్యాలయాల్లో గతేడాది అక్టోబరులో సోదాలు నిర్వహించింది. నకిలీ పత్రాలు సృష్టించే డిజిటల్ పరికరాలు సహా, వివిధ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. ఎండాడలోని హయగ్రీవ ప్రాజెక్టుకు సంబంధించిన 12.51 ఎకరాల భూమిని మోసపూరితంగా లాక్కున్నారని గతేడాది జూన్‌ 22న చిలుకూరు జగదీశ్వరుడు, ఆయన భార్య రాధారాణి.. ఆరిలోవ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడ నమోదైన ఎఫ్ఐఆర్‌ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ దర్యాప్తు చేపట్టింది.

Tags:    
Advertisement

Similar News